కాబూల్‌లో బాంబుదాడి..8 మంది మృతి

శుక్రవారం ప్రార్థనల కోసం వచ్చిన వారిని లక్ష్యంగా చేసుకుని దాడికి తెగబడిన ఐఎస్

IED blast
blast

కాబూల్‌ః ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్ పేలుడు సంభవించింది. శుక్రవారం ప్రార్థనల కోసం వచ్చిన వారిని లక్ష్యంగా చేసుకున్న ఉగ్రవాదులు జరిపిన బాంబు దాడిలో 8 మంది ప్రాణాలు కోల్పోగా మరో 18 మంది గాయపడ్డారు. ఈ పేలుడు తమ పనేనని కరుడుగట్టిన ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ ప్రకటించింది.

ఆఫ్ఘనిస్థాన్ స్థానిక మీడియా ప్రకారం.. ఆఫ్ఘనిస్థాన్‌లోని అతిపెద్ద మైనారిటీ అయిన హజారాస్ జాతిని లక్ష్యంగా చేసుకుని ఐఎస్ ఈ దాడికి పాల్పడింది. మసీదు వద్ద ప్రార్థనల కోసం వచ్చిన మహిళలు, చిన్నారులను టార్గెట్‌గా చేసుకుని దాడికి పాల్పడింది. మొత్తం రెండు పేలుళ్లు జరగ్గా ఒకటి సర్-ఇ-కరిజ్ ప్రాంతంలోని ఇమామ్ బాకిర్ అనే మహిళా మసీదులో చోటుచేసుకుంది. ఈ ఘటనలో 8 మంది చనిపోయారని ప్రభుత్వం చెబుతుండగా, చనిపోయింది 20 మందని ఇస్లామిక్ స్టేట్ తెలిపింది.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/news/movies/