హెలికాప్టర్కు సంబంధించిన బ్లాక్బాక్స్ స్వాధీనం
చెన్నై : భారత వాయుసేనకు సంబంధించిన ఎంఐ17వీ5 (Mi-17V5) హెలికాప్టర్ కూలిపోయిన విషయం తెలిసిందే. హెలికాప్టర్కు సంబంధించిన బ్లాక్బాక్స్ను తమిళనాడు ఫోరెన్సిక్ సైన్స్ విభాగానికి చెందిన బృందం గురువారం గుర్తించింది. ప్రమాదం జరిగిన స్థలం నుంచి 30 అడుగుల దూరంలో బ్లాక్బాక్స్ లభ్యమైంది. అనంతరం బ్లాక్బాక్స్ను ఆర్మీ అధికారులు స్వాధీనం చేసుకొని, వెల్లింగ్టన్ బేస్ క్యాంప్కు తరలించారు. అక్కడికి ఢిల్లీకి తరలించి, అందులో ఉన్న డేటాను డీకోడ్ చేయనున్నారు.
బ్లాక్ బాక్స్లో 13 గంటల పాటు నిడివి ఉన్న డేటా నిక్షిప్తమై ఉంటుంది. క్రాష్ అయిన సమయంలో మాత్రం ప్రమాదానికి ముందు అరగంట ముందు ఏం జరిగిందన్న సమాచారం అందివ్వనున్నది. సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్, సహా 14 మంది ప్రయాణిస్తున్న ఐఏఎఫ్కు చెందిన హెలికాప్టర్ బుధవారం తమిళనాడులోని కూనూర్లో కూలిపోయిన విషయం తెలిసిందే. జనరల్ బిపిన్ రావత్ సహా 13 మంది దుర్మరణం పాలయ్యారు. ఈ హెలికాప్టర్ ప్రమాదానికి గల కారణాలు తెలిసే అవకాశం ఉన్నది. అలాగే ప్రమాదానికి ముందు పైలెట్లు జరిపిన సంభాషణ సైతం రికార్డయ్యే అవకాశాలుంటాయి. హెలికాప్టర్ ప్రమాద దర్యాప్తులో బ్లాక్ బాక్స్ కీలకం కానున్నది.
తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/international-news/