తెలంగాణలో బిజెపి కుట్రలు నడవవు: హరీశ్ రావు
బిజెపి రాజకీయాలు అందరికీ తెలుసని ఎద్దేవా
హైదరాబాద్ః ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో నిందితుడు అమిత్ అరోరా రిమాండ్ రిపోర్డులో టిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేరు రావడం కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. బిజెపి రాజకీయాలు దేశంలో అందరికీ తెలుసని… ఎన్నికలు వస్తున్నాయంటే ఈడీలు, ఐటీలతో ఆ పార్టీ దాడులు చేయించడం సహజమేనని అన్నారు.
అంతేకాదు బిజెపి వదిలే బాణాలు, పెట్టించే పార్టీలు కూడా ఉంటాయని పరోక్షంగా వైఎస్ఆర్టిపి అధ్యక్షురాలు షర్మిలపై విమర్శలు గుప్పించారు. బీహార్, యూపీలాంటి రాష్ట్రాల్లో అయితే బిజెపి బాణాలు, పార్టీలు, కుట్రలు నడుస్తాయని.. ఉద్యమాల గడ్డ తెలంగాణలో అవి నడవవని అన్నారు. కవితతో కలిసి హరీశ్ రావు జగిత్యాల జిల్లాలో పర్యటించారు. ఈ నెల 7న జరిగే కేసీఆర్ బహిరంగసభకు సంబంధించిన ఏర్పాట్లను వీరు పరిశీలించారు. ఈ సందర్భంగా హరీశ్ మాట్లాడుతూ పైవ్యాఖ్యలు చేశారు.
తాజా ఏపి వార్తల కోసం క్లిక్ చేయండిః https://www.vaartha.com/andhra-pradesh/