రేపు రాష్ట్ర వ్యాప్తంగా119 నియోజకవర్గాలలో బిజెపి బహిరంగ సభలు

bjp-public-meetings-in-119-constituencies-tomorrow

హైదరాబాద్‌ః బిజెపి స్ట్రీట్ కార్నర్ మీటింగ్ల ముగింపు రోజైన మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా119 నియోజకవర్గాలలో 119 బహిరంగ సభలు నిర్వహించేందుకు కమలం పార్టీ ఏర్పాట్లు చేస్తోంది. కార్నర్ మీటింగ్ లపై ఆదివారం పార్టీ స్టేట్ ఆఫీసులో జిల్లా అధ్యక్షులు, కార్నర్ మీటింగ్ల జిల్లా ఇన్ఛార్జులు, నేతలతో పార్టీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ సమీక్షించారు. గడువులోగా కార్నర్ మీటింగ్లు పూర్తి చేయాలని సంజయ్ వారిని అదేశించారు. కార్నర్ మీటింగ్ కు భారీగా ముగింపు పలకాలని సూచించారు. 119 బహిరంగ సభలపై కూడా సంజయ్ చర్చించారు. ముగింపు సభలను కనీసం ఐదు వేల మందితో నిర్వహించాలన్నారు. జాతీయ నేతల ఆదేశాలతో 119నియోజకవర్గాల్లో సభలను కమలం నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. బహిరంగ సభల్లో వివిధ నియోజకవర్గాల్లో బండి సంజయ్, కిషన్ రెడ్డి, లక్ష్మణ్, వివేక్ వెంకటస్వామి, ఈటల, డీకే అరుణ, సోయం బాబురావు, అర్వింద్, రఘునందనరావు, మురళీధర్ రావు తో పాటు పలువురు సీనియర్ నేతలు పాల్గొననున్నారు.