కరోనా వైరస్‌పై ఎంపిలకు ప్రధాని పలు ఆదేశాలు

ఎంపిలు తమ నియోజక వర్గాల్లో పర్యటించాలని పిలుపు…కరోనాపై తీసుకోవాల్సిన జాగ్రత్తల అవగాహన కల్పించాలని సూచన

PM Narendra Modi
PM Narendra Modi

న్యూఢిల్లీ: ప్రధాని మోడి అధ్యక్షతన బిజెపి పార్లమెంటరీ పార్టీ సమావేశం జరుగుతుంది. ఈనేపథ్యంలో ఈ సమావేశంలో కరోనా వైరస్‌ ప్రభావంపై కూడా పలువురు నేతలు మాట్లాడారు. ప్రధానమంత్రి మోడి ఈ విషయంపై మాట్లాడుతూ ఎంపీలకు పలు సూచనలు చేశారు. ప్రతి బిజెపి ఎంపీ తమ నియోజక వర్గాల్లో పర్యటించి కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రజలకు అవగాహన కల్పించాలని ఆయన సూచించారు. ఈ సమావేశంలో పార్టీకి సంబంధించిన పలు అంశాలపై బిజెపి నేతలు చర్చిస్తున్నారు. కాగా, దేశంలో కరోనా కేసులు పెరిగిపోవడం ఆందోళన కలిగిస్తోంది. దేశంలో ఇప్పటికి కరోనా సోకిన వారి సంఖ్య 129కి చేరింది.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/