స్వీయ నిర్బంధంలో బిజెపి ఎంపి సురేష్‌ ప్రభు

కరోనా వైరస్‌ నియంత్రణ చర్యల్లో భాగంగా స్వీయ నిర్బంధం

bjp-mp-suresh-prabhu
bjp-mp-suresh-prabhu

న్యూఢిల్లీ: బిజెపి ఎంపి సురేశ్ ప్రభు తన నివాసంలోనే స్వీయ నిర్బంధం విధించుకున్నట్టు వెల్లడించారు. ఈ నేపథ్యంలో, తాను పార్లమెంటు సమావేశాలకు రాలేనని రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడికి లేఖ రాశారు. త్వరలో జరగనున్న జీ20 సదస్సుకు సంబంధించి సౌదీ అరేబియాలోని అల్ ఖోబర్ లో మార్చి 10న నిర్వహించిన సమావేశానికి తాను హాజరయ్యానని… ముందు జాగ్రత్తగా చేయించుకున్న వైద్య పరీక్షలో కరోనా నెగెటివ్ వచ్చిందని లేఖలో ఆయన తెలిపారు. అయినా, నియంత్రణ చర్యల్లో భాగంగా 14 రోజుల పాటు ఇంట్లోనే సెల్ఫ్ ఐసొలేషన్ లో ఉండాలని నిర్ణయించుకున్నానని చెప్పారు. ఈ కారణంగానే తాను పార్లమెంటు సమావేశాలకు హాజరు కాకూడదని నిర్ణయించుకున్నానని తెలిపారు. కేంద్ర మంత్రి మురళీధరన్ కూడా తన నివాసంలో స్వీయ నిర్బంధం విధించుకున్న సంగతి తెలిసిందే.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/