ఏపీలో రాబోయేది బీజేపీ-‘జనసేన ‘ ప్రభుత్వమే: జివిఎల్

రాయలసీమ సమస్యలపై రేపు కడపలో ‘రణభేరి’

BJP Rajya Sabha member GVL Narasimha Rao
BJP Rajya Sabha member GVL Narasimha Rao

Amaravati: ఆంధ్రప్రదేశ్ లో త్వరలో రాబోయేది బీజేపీ-‘జనసేన’ కూటమి ప్రభుత్వమేనని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు ధీమా వ్యక్తం చేశారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ , ఏపీలో ‘జనసేన’తో కలిసి అడుగు వేస్తూ పార్టీని బలోపేతం చేసుకుంటామని అన్నారు.

రాబోయే 2024లో వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. వైసీపీకి ప్రత్యామ్నాయంగా బీజేపీ ఉంటుందని చెప్పారు. బీజేపీ, జనసేన పార్టీలకు చెందిన కీలక నేతలందరూ సమావేశమై రాజకీయ వ్యూహాలను రూపొందించ నున్నామని వెల్లడించారు. రాయలసీమ సమస్యలపై కడపలో సోమవారం ‘రణభేరి’ నిర్వహించనున్నామని పేర్కొన్నారు.

జాతీయ వార్తల కోసం :https://www.vaartha.com/news/national/