వైస్సార్సీపీ ది ఆర్భాటమే తప్ప, చేసిందేమీ లేదు : జీవీఎల్

చంద్రబాబు చెపితే మేము అజెండా మార్చామని అంటున్నారు


అమరావతి: కేంద్ర హోంశాఖ ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ అజెండా నుంచి ప్రత్యేకహోదా అంశాన్ని తొలగించడం వెనుక తన హస్తం ఉందంటూ వైస్సార్సీపీ నేతలు చేస్తున్న విమర్శలను బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు ఖండించారు. టీడీపీ అధినేత చంద్రబాబు చెపితే తాము అలా చేశామనే వైస్సార్సీపీ నేతల ప్రచారం ముమ్మాటికీ అవాస్తవమని అన్నారు. చంద్రబాబు చెపితే తాము మారుస్తామా? అని ప్రశ్నించారు.

వైస్సార్సీపీ నేతలు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారని అన్నారు. ప్రధాని మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఏవైనా నిర్ణయాలు చేస్తే వాటిని తాము మార్చగలమా? అని ప్రశ్నించారు. వైస్సార్సీపీ చేస్తున్న రాజకీయాలను ప్రజలు అర్థం చేసుకోవాలని అన్నారు. వైస్సార్సీపీది ఆర్భాటమే తప్ప.. చేసిందేమీ లేదని ఎద్దేవా చేశారు. బీజేపీపై బురద చల్లేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/