తన ఇంటిపై దాడి ఘటన ఫై బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ ఫైర్

ఎమ్మెల్సీ కవిత ఫై బిజెపి ఎంపీ అరవింద్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా శుక్రవారం బంజారాహిల్స్ లోని అరవింద్ ఇంటిపై టిఆర్ఎస్ కార్య కర్తలు దాడి చేసారు. ఇంట్లో అరవింద్ లేని సమయంలో కార్య కర్తలు పెద్ద ఎత్తున అరవింద్ ఇంటికి చేరుకొని , ఫర్నిచర్ ధ్వసం చేసారు. పార్కింగ్ లో ఉన్న కార్ అద్దాలు ధ్వసం చేసారు. ఈ దాడి పట్ల అరవింద్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

కేసీఆర్, కేటీఆర్, కవిత ఆదేశాలతోనే నా ఇంటిపై దాడి జరిగిందన్నారు. టీఆర్ఎస్ గూండాలు ఇంట్లో వస్తువులు పగులకొట్టి బీభత్సం సృష్టించారు.. ఇంట్లో ఎవరూ లేనప్పుడు చూసి దాడి చేయడం తప్పు.. కవితకు ఇంత కుల అహంకారం ఎందుకు? అని నిలదీశారు. టీఆర్‌ఎస్‌ పార్టీ నేతల దాడులకు తామ అస్సలు భయపడబోమన్నారు. నీ అయ్యను చెప్పుతో కొట్టానా..నువ్వు నన్ను ఎందుకు కొడతావని కవితకు అరవింద్ కౌంటర్ ఇచ్చారు. ఇంట్లో ఉన్న తన తల్లిని బెదిరించారని అరవింద్ అన్నారు.