బ్రేకుల్లేని బస్సులో పాకిస్థాన్ పంపుతాం
బిజెపి ఎంపి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
వరంగల్: తెలంగాణ బిజెపి ఎంపి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సిఏఏను వ్యతిరేకిస్తున్న వారందనీ బ్రేకుల్లేని బస్సులో పాకిస్థాన్ పంపుతామని ఆయన అన్నారు. దేశాన్ని విచ్ఛిన్నం చేసేందుకు కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు కంకణం కట్టుకున్నాయని ఆయన విమర్శించారు. ద్రోహుల్లారా ఖబడ్దార్, మీరు రాళ్లు పడితే.. మేం బాంబులు పడతాం. మీరు కర్రలు పడితే.. మేం కత్తులు పట్టుకుంటాం. యుద్ధం మొదలైంది, ఎవ్వరినీ వదిలేదిలేదు. తెలంగాణలో టిఆర్ఎస్, ఎంఐఎం అన్నదమ్ముల్లా వ్యవహరిస్తున్నారని ఆయన అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో టిఆర్ఎస్కు ఓటు వేస్తే అది ఎంఐఎంకు వేసినట్లే అని సంజయ్ అన్నారు. కెసిఆర్, ఓవైసి సోదరుల ఆటలు ఇక తెలంగాణలో సాగవు. కెసిఆర్, కెటిఆర్ యాగం చేసినప్పుడు అసదుద్దీన్ హిందుత్వ ఆరోపణలు ఎందుకు చేయలేదు అని ఆయన ప్రశ్నించారు. 12 శాతం ఉన్న మైనారిటీల కోసం 85 శాతం ఉన్న హిందువులను పట్టించుకోరా? అని ఆయన నిలదీశారు. అందరు నేతలు కాషాయ జెండా పట్టుకునే సమయం దగ్గర్లోనే ఉందని ఎంపి సంజయ్ వ్యాఖ్యానించారు.
తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/business/