సిరిసిల్లలో నీవు ఓడిపోకపోతే అడుగు

మీరు తీసుకుంటున్న జీతాలు కూడా ప్రజల డబ్బే..బిజెపి ఎంపీ అర్వింద్

Dharmapuri Arvind
Dharmapuri Arvind

హైదరాబాద్‌: బిజెపి ఎంపీ అర్వింద్‌ మంత్రి కెటిఆర్‌పై మండిపడ్డారు. ఈ మధ్య కాలంలో ఫ్రస్ట్రేషన్ లో కెటిఆర్ ప్రెస్ మీట్లు పెడుతున్నారని అన్నారు. కెటిఆర్ వాడుతున్న భాష కూడా సరిగా లేదని… కెసిఆర్ కొడుకు కాబట్టే కెటిఆర్ అలాంటి భాషను వాడుతున్నారని మండిపడ్డారు. కెటిఆర్ కు ఇంత అహంకారం ఎందుకని ప్రశ్నించారు. హైదరాబాద్ వరద బాధితులకు టిఆర్‌ఎస్‌ చేస్తున్న సాయం… జనాలు పన్నుల రూపంలో కట్టిన డబ్బేనని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధుల నుంచే ఈ సాయం చేశారని అన్నారు. ప్రజల డబ్బును వారికే ఇస్తూ… టిఆర్ఎస్ ఇస్తున్నట్టు డబ్బా కొట్టుకుంటున్నారని మండిపడ్డారు. కెసిఆర్‌, కెటిఆర్‌, కవిత, హరీశ్ రావు తీసుకుంటున్న జీతాలు కూడా ప్రజల డబ్బేనని అన్నారు.

దుబ్బాకలో టిఆర్ఎస్ కు ఏడు చెరువుల నీళ్లు తాగించామని అర్వింద్ అన్నారు. ‘వచ్చే ఎన్నికలలో సిరిసిల్లలో నీవు ఓడిపోకపోతే అడుగు కెటిఆర్’ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అక్రమ కట్టడాలను కూల్చడంలో ప్రధాని మోదీని చూసి నేర్చుకోవాలని కెటిఆర్ కు సూచించారు. గుజరాత్ సీఎంగా 2 లక్షల అక్రమ కట్టడాలను మోదీ కూల్చారని… పాతబస్తీలో పాన్ దుకాణం తీయాలన్నా కెటిఆర్ కు ప్యాంటు తడుస్తుందని ఎద్దేవా చేశారు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/