అది జరక్కుంటే రంగంలోకి దిగుతా
-గోవుల అక్రమ తరలింపును అడ్డుకోండి: రాజాసింగ్
Hyderabad: భాజపా ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి హైదరాబాద్ సిపి సజ్జనార్కు సవాల్ విసిరారు.. 5 రోజుల్లో గోవుల అక్రమ తరలింపును అడ్డుకోకుంటే తనే రంగంలోకి దిగుతానని వెల్లడించారు.
బహుదూర్పుర పోలీసు స్టేషన్ ముందు నుంచే ఆవులను అక్రమంగా తరలిస్తున్నారని అందుకు సంబంధించిన వీడియోలను రాజాసింగ్ విడుదల చేశారు.
కాగా గురువారం ఆయన ఇక్కడి మీడియాతో మాట్లాడారు. ‘మీకు చేత కాకుండటే అనే పదాన్ని తాను ఉపయోగించవచ్చని,. అయితే పోలీసు కమిషనర్పై తమకు గౌరవం ఉందన్నారు.
చెక్పోస్టులను ఏర్పాటుచేసి గోవులను అక్రమంగా తరలిస్తున్నవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
తాజా ‘నిఘా’ వార్తల కోసం : https://www.vaartha.com/specials/investigation/