కెసిఆర్ జాతీయ స్థాయికి పోయి చేసేదేముందిః ఈటల

ఐలమ్మ విగ్రహాన్ని ట్యాంక్ బండ్ పై ఏర్పాటు చేయాలని డిమాండ్

etela-rajender

హైదరాబాద్ః చౌటుప్పల్ లో చాకలి ఐలమ్మ విగ్రహానికి ఈరోజు బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం స్థానిక బిజెపి కార్యాలయంలో మాట్లాడుతూ.. నిజాంకు వ్యతిరేకంగా పోరాడిన చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ట్యాంక్ బండ్ పై ఏర్పాటు చేయాలని ఈటల ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. అమరవీరుల స్తూపం నిర్మాణాన్ని పూర్తి చేయాలని అన్నారు. అమర వీరుల కుటుంబాలను ఆదుకుంటామని ఇచ్చిన హామీలను కెసిఆర్ ఇంతవరకు నెరవేర్చలేదని మండిపడ్డారు. రాష్ట్రాన్ని కెసిఆర్ నాశనం చేశారని అన్నారు.

ఈ సందర్భంగా ఈటల కెసిఆర్‌ మరోసారి విమర్శలు గుప్పించారు. జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలనుకుంటున్న కెసిఆర్ ను ఆయన ఎద్దేవా చేశారు. కెసిఆర్ వ్యవహారశైలి చూస్తుంటే… కూట్లో రాయి తీయలేనివాడు ఏట్లో రాయి తీస్తానన్నట్టుగా ఉందని అన్నారు. ధనిక రాష్ట్రమైన తెలంగాణను అప్పుల ఊబిలోకి నెట్టేశారని… ఈయన జాతీయ స్థాయికి వెళ్లి చేసేదేముందని ప్రశ్నించారు. తెలంగాణను అవినీతికి కేరాఫ్ అడ్రస్ గా కెసిఆర్ మార్చారని దుయ్యబట్టారు. దేశంలో, రాష్ట్రంలో కెసిఆర్ ఒక చెల్లని రూపాయిగా మారిపోయారని అన్నారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/andhra-pradesh/