దుబ్బాక..నాలుగో రౌండ్లో బిజెపి ఆధిక్యం
నాలుగు రౌండ్ల తర్వాత 2,684 ఓట్ల ఆధిక్యం
టిఆర్ఎస్కి 10,371.. కాంగ్రెస్కి 2,158 ఓట్లు
సిద్దిపేట: దుబ్బాక ఉప ఎన్నికల ఫలితాల లెక్కింపు కొనసాగుతోంది. తొలి నాలుగు రౌండ్లు లెక్కింపు పూర్తయ్యే సరికి బిజెపి అభ్యర్థి రఘునందన్రావు 2,684 ఓట్ల ఆధిక్యంలో ఉండడం గమనార్హం. బిజెపి 13,055, టీఆర్ఎస్ 10,371, కాంగ్రెస్ 2,158 ఓట్లతో ఉన్నాయి. అంతకుముందు మూడో రౌండ్లోనూ బిజెపి ఆధిక్యం ప్రదర్శించింది. టిఆర్ఎస్ కంటే 1,885 ఓట్ల ఆధిక్యంలో బిజెపి అభ్యర్థి రఘునందన్ మూడో రౌండ్లో నిలిచి, నాలుగో రౌండ్లో మరింత దూకుడు కనబర్చారు. సిద్దిపేటలోని ఇందూరు ఇంజనీరింగ్ కళాశాలలో ఈ లెక్కింపు కొనసాగుతోంది. ఈ ఎన్నికల్లో టిఆర్ఎస్ నుంచి సోలిపేట సుజాత, కాంగ్రెస్ నుంచి చెరుకు శ్రీనివాస్రెడ్డి పోటీలో ఉన్న విషయం తెలిసిందే.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/national/