మధ్యప్రదేశ్లో బిజెపి హవా
భోపాల్: మధప్రదేశ్ 28 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. మొదటి గంటల్లో వెలువడిన ఫలితాల ప్రకారం బిజెపి ఆధిక్యంలో కొనసాగుతంది. ఉదయం 9.55 గంటల సమయంలో బిజెపి 18 స్థానాలు, కాంగ్రెస్ 9 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. సాంవెర్ నుంచి పోటీ చేసిన తులసీరామ్ సిలావట్, గ్వాలియర్ నుంచి పోటీ చేసిన ప్రద్యేమ్నసింగ్, అనూప్పూర్ నుంచి బిజెపి తరపున బరిలోకి దిగిన బిసాహూలాల్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
కాగా బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తేజస్వి యాదవ్ సారథ్యంలోని మహాఘట్బంధన్ దూసుకుపోతుండగా, మధ్యప్రదేశ్లో జరిగిన ఉప ఎన్నికల్లో బిజెపి దూకుడు కొనసాగుతోంది.
తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/business/