గవర్నర్ తమిళిసై ను కలిసిన టీబీజేపీ నేతలు

తెలంగాణ బిజెపి నేతలు గవర్నర్ తమిళిసై ను కలిశారు. సోమవారం బండి సంజయ్ కాన్వాయ్ ఫై జరిగిన దాడి పట్ల వారంతా గవర్నర్ కు పిర్యాదు చేసారు. హుజురాబాద్ ఉప ఎన్నిక లో బీజేపీ గెలుపును జీర్ణించుకోలేక టీఆర్ఎస్ దాడులు చేస్తున్నారని బీజేపీ నాయకురాలు డీకే అరుణ అన్నారు. భయానక వాతావరణ సృష్టించాలని చూస్తున్నారని, బెంగాల్ తరహా రాజకీయాలు తెలంగాణలో చేయాలని చూస్తున్నారన్నారు.

స్వయంగా సీఎంయే మెడలు నరికేస్తాం,ఆరు ముక్కలు చేస్తా అన్నారన్నారు. సీఎం స్థాయికి తగని భాష మాట్లాడుతున్నారని విమర్శించారు. రైతుల బాధలు పట్టించుకోకుండా తమపై దాడులు చేస్తున్నారని ఆరోపించారు. ఉప ఎన్నికల్లో గెలుపు కోసం వేల కోట్లు ఖర్చు చేశారని డీకే అరుణ విమర్శించారు. అనేక అబద్ధపు హామీలు చేసిన హుజూరాబాద్ ప్రజలు లొంగకుండా… బెదరకుండా స్పష్టమైన తీర్పు నిచ్చారన్నారు. ఎన్నికలు, ఓట్లు వస్తే తప్పా సీఎం ఏం చేయలేని పరిస్థితి ఉందని ఆరోపించారు.