మునుగోడులో బిజెపి జెండా ఎగరడం ఖాయంః వివేక్ వెంకటస్వామి

bjp-leader-vivek-venkataswamy-comments-on-kcr-over-mission-bhagiratha-issue

హైదరాబాద్‌ః మునుగోడు బైపోల్లో బిజెపి గెలుపు ఖాయమని ఉప ఎన్నికల స్టీరింగ్ కమిటీ అధ్యక్షుడు వివేక్ వెంకటస్వామి అన్నారు. ఎన్నికల నోటిఫికేషన్ త్వరగా రావడం ఆనందంగా ఉందన్నారు. మునుగోడు నియోజకవర్గంలో రాజగోపాల్ రెడ్డి చేసిన సేవలు, కేంద్ర ప్రభుత్వం గ్రామాలకు అందిస్తున్న పథకాలు ప్రజలకు స్పష్టంగా తెలుసన్నారు. ఎన్నికలు వస్తేనే కెసిఆర్ కు హామీలు, ప్రజలు గుర్తొస్తారని విమర్శించారు. మునుగోడులో బిజెపి జెండా ఎగురవేస్తామని స్పష్టం చేశారు.

కాగా, మునుగోడులో మాజీ ఎంపీ, జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి నేతృత్వంలో స్టీరింగ్ కమిటీ పనిచేస్తోంది. నియోజకవర్గం లోని అన్ని మండలాలకు ఇన్ ఛార్జీలను, సమన్వయ కమిటీలను నియమించారు. మరో 2, 3 రోజుల్లో ప్రతీ గ్రామానికి ముగ్గురు లీడర్స్ తో గ్రామ కమిటీలను వేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఎంపిక చేసిన ముఖ్య కార్యకర్తలను మునుగోడుకు పంపించనున్నారు బిజెపి నేతలు. ఒక్కో ఓటర్ ను కనీసం మూడు నుంచి నాలుగు సార్లు కలుస్తామని చెప్తున్నారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/andhra-pradesh/