ఎయిమ్స్లో చేరిన ఉమాభారతి
ఉమ ఆరోగ్యంపై కేంద్రమంత్రి హర్షవర్ధన్ ఆందోళన
న్యూఢిల్లీ: బిజెపి సీనియర్ నేత ఉమా భారతికి కరోనా సోకిన విషయం తెలిసిందే. జ్వరం ఏమాత్రం తగ్గకపోగా, మరింత పెరగడంతో తప్పని పరిస్థితుల్లో రిషికేష్లోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చేరినట్టు ఆమె ట్వీట్ చేశారు. కాగా, పరీక్షల అనంతరం వైద్యులు కనుక తనకు అనుమతి ఇస్తే రేపు బాబ్రీ మసీదు కూల్చివేత కేసు తీర్పు వెలువడనున్న సందర్భంగా లక్నోలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంలో హాజరవుతానని తెలిపారు. నిజానికి తాను కోర్టుకు హాజరు కావాలన్న ఉద్దేశంతోనే ఆసుపత్రిలో చేరినట్టు పేర్కొన్నారు. తన ఆరోగ్యంపై కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ ఆందోళన చెందుతున్నట్టు తెలిపారు. తనకు రెండోసారి నిర్వహించిన పరీక్షల్లోనూ పాజిటివ్గా నిర్ధారణ అయినట్టు చెప్పారు.
కాగా ఇటీవల ఉమాభారతి కేదార్నాథ్, బద్రీనాథ్ ఆలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం జ్వరం రావడంతో పరీక్షలు చేయించుకోగా కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది.
తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/business/