అమరావతిలో భారీ అవినీతికి పాల్పడ్డారు
చంద్రబాబు తొలుత రాజకీయ నేతగా ఉండి నెమ్మదిగా నటుడిగా మారారు!
విశాఖపట్నం: టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుతో పాటు ఆ పార్టీ నేతలు అమరావతిలో భారీ అవినీతికి పాల్పడ్డారని బిజెపి జాతీయ కార్యదర్శి, ఏపీ ఇన్చార్జ్ సునీల్ దేవ్ధర్ అన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సినిమాల్లోంచి రాజకీయ నేతగా మారారని, కానీ చంద్రబాబు నాయుడు తొలుత రాజకీయ నేతగా ఉండి నెమ్మదిగా నటుడిగా మారారని ఎద్దేవా చేశారు. వైజాగ్లో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. విధి నిర్వహణలో భాగంగా ప్రధాన మంత్రిని రాష్ట్రాల ముఖ్య మంత్రులు కలవడం సహజం అని తెలిపారు. దానిలో భాగంగానే ప్రధాని మోడీని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కలిశారని తెలిపారు. వైఎస్సార్సిపి పార్టీతో బిజెపి పొత్తు పెట్టుకుందని టిడిపి నేతలు అనవసర ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. వైఎస్సార్సిపితో పొత్తు పెట్టుకునే ఆలోచన లేదని అన్నారు. రాష్ట్రాల అభివృద్ధి విషయంలో కేంద్రం నిష్పక్షపాతంగా వ్యవహరిస్తుందని సునీల్ దేవ్ధర్ తెలిపారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/