ప్రధాని వస్తే సీఎం కేసీఆర్ స్వాగతం పలకకపోవడం సిగ్గుచేటు – రామచందర్ రావు

బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాల్లో భాగంగా ప్రధాని మోడీ హైదరాబాద్ కు చేరుకున్నారు. చాలఏళ్ల తర్వాత జాతీయ కార్యవర్గ సమావేశాలు జరగబోతుండడంతో బిజెపి అగ్ర నేతలు , ఇతర రాష్ట్రాల బిజెపి ముఖ్యమంత్రులు ఇలా అంత హైదరాబాద్ లో ఉన్నారు. ఇదిలా ఉంటె హైదరాబాద్ కు ప్రధాని వస్తే సీఎం కేసీఆర్ స్వాగతం పలకకపోవడం సిగ్గుచేటని బీజేపీ నేత రామచందర్ రావు విమర్శించారు. ‘ప్రధాని లేదా రాష్ట్రపతి వస్తే ఆ రాష్ట్ర సీఎం వారికి స్వాగతం పలకాలి. ఇది ప్రోటోకాల్..దీనిని ఉల్లంఘించడం సరికాదు. దేశ ప్రధానిని పార్టీలకతీతంగా గౌరవించాలి’’ అని రామచందర్ రావు అన్నారు.

విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి అయిన యశ్వంత్ సిన్హా హైదరాబాద్ వస్తే సీఎం కేసీఆర్ పార్టీ శ్రేణులతో కలిసి వెళ్లి స్వయంగా స్వాగతం పలికారు. ప్రధాని రావడానికి కొన్ని గంటల ముందే సిన్హా హైదరాబాద్ వచ్చారు. అయితే ప్రధానికి మాత్రం కేసీఆర్ స్వాగతం పలకకపోవడంతో బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక దీనిపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పందించారు. ప్రోటోకాల్ ప్రకారం ప్రధానికి స్వాగతం పలకడానికి సీఎం రావాలని ఎక్కడా లేదని.. రాష్ట్రప్రభుత్వ ప్రతినిధిగా ఎవరైనా రావొచ్చని తెలిపారు.