ఢిల్లీలో నేడు బీజేపీ భీం పాదయాత్ర
కేసీఆర్ వ్యాఖ్యలపై వరుస ఆందోళనలు
న్యూఢిల్లీ : రాజ్యాంగాన్ని తిరగరాయాలంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ వరుస నిరసనలు, ఆందోళనలకు సిద్ధమవుతోంది. శుక్రవారం ఢిల్లీ తెలంగాణ భవన్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద నుంచి పార్లమెంట్ వరకు బీజేపీ భీం పాదయాత్ర చేయబోతోంది. మధ్యాహ్నం 3 గంటలకు తెలంగాణ భవన్ నుండి ప్రారంభం కానున్న పాదయాత్రలో బండి సంజయ్తో పాటు ఎంపీలు సోయం బాబూరావు, ధర్మపురి అరవింద్, బీజేపీ జాతీయ ఎస్సీ మోర్చా రాష్ట్ర ఇంఛార్జ్, కోలార్ ఎంపీ మునుస్వామి తదితరులు పాల్గొంటారు.
తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/