బిజెపికి బిగ్ షాక్ : టిఆర్ఎస్ లో చేరిన జీహెచ్ఎంసీ బిజెపి కార్పొరేట‌ర్లు

మరో రెండు రోజుల్లో హైదరాబాద్ లో బిజెపి భారీ బహిరంగ సభ జరగబోతుండడం..మోడీ సైతం హాజరు కానున్న నేపథ్యంలో బిజెపి కి భారీ షాక్ తగిలింది. బీజేపీకి చెందిన నలుగురు జీహెచ్ఎంసీ కార్పొరేట‌ర్లు, తాండూరు మున్సిపాలిటీ బీజేపీ ఫ్లోర్ లీడ‌ర్‌తో క‌లిసి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సమక్షంలో గురువారం టీఆర్ఎస్ పార్టీలో చేరారు.

హస్తినాపురం కార్పొరేటర్ బానోతు సుజాతనాయక్, రాజేంద్రనగర్ కార్పొరేటర్ పొడవు అర్చనప్రకాశ్‌, జూబ్లీహిల్స్ కార్పొరేటర్ డేరంగుల వెంకటేశ్‌, అడిక్‌మెట్‌ కార్పొరేటర్ సునీత‌ప్రకాశ్‌గౌడ్, తాండూరు మున్సిపల్ బీజేపీ ఫ్లోర్ లీడర్ సింధూజగౌడ్, కౌన్సిలర్ ఆసిఫ్ పార్టీలో చేరగా, వారికి కేటీఆర్ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానం పలికారు. ఈ కార్యక్రమంలో చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్యేలు మాగంటి గోపినాథ్, దానం నాగేందర్, పైలెట్ రోహిత్‌రెడ్డి, సుధీర్‌రెడ్డి పాల్గొన్నారు. ఇక బిజెపి కార్పొరేట‌ర్లు టిఆర్ఎస్ లో చేరడం తో బిజెపి నేతలు షాక్ లో ఉన్నారు.