టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత కు చేదు అనుభవం..

టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత కు రంగారెడ్డి జిల్లా కోర్ట్ లో చేదు అనుభవం ఎదురైంది. ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా బతుకమ్మ సంబరాలు అంబరాన్ని తాకుతున్న సంగతి తెలిసిందే. రాజకీయ నేతలు సైతం బతుకమ్మ వేడుకల్లో పాల్గొంటూ ఆడపడుచుల్లో ఉత్సహం నింపుతున్నారు. ఇక ఎమ్మెల్సీ కవిత సైతం అనేక చోట్ల బతుకమ్మ వేడుకల్లో పాల్గొంటూ వస్తున్నారు. ఈ తరుణంలో బతుకమ్మ వేడుకల్లో పాల్గొనేందుకు రంగారెడ్డి జిల్లా కోర్టుఆవరణలోకి వెళ్లగా..అక్కడ పలువురు న్యాయవాదులు ఆమెను అడ్డుకున్నారు.

తమ సమస్యలు ఎప్పుడూ పట్టించుకోని మీరు.. ఇప్పుడెలా వస్తారంటూ న్యాయవాదులు నిలదీశారు. గో బ్యాక్ గో బ్యాక్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేయడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేయగా.. న్యాయవాదులు కు పోలీసులకు మధ్య స్వల్ప తోపులాట చోటుచేసుకుంది. కోర్టు ప్రాంగణంలో ఎలాంటి ఆందోళనలకు అనుమతి లేదని పోలీసులు న్యాయవాదులకు నచ్చజేప్పే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ న్యాయవాదులు వెనక్కి తగ్గకపోవడంతో వారిని స్టేషన్ కు తరలించారు.