పండంటి బిడ్డకు జన్మనిచ్చిన బిపాషా బసు
బాలీవుడ్ హీరోయిన్ బిపాషా బసు శనివారం పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. ఇటీవలే రణబీర్ కపూర్ మరియు అలియా భట్ ఒక అందమైన పాపకు జన్మనివ్వగా ఇప్పుడు బిపాషా బసు కూడా ఆడపిల్ల కు జన్మనిచ్చింది. పెళ్లయిన ఆరేళ్ల తర్వాత కరణ్, బిపాషా తల్లిదండ్రులు అయ్యారు. బిపాసా బసు ఆగస్టులో తన ప్రెగ్నెన్సీ గురించిన సమాచారాన్ని అభిమానులతో షేర్ చేసుకుంది. ఆ తరువాత కూడా ఈ జంట చాలాసార్లు గ్లామరస్ ఫోటోలు పంచుకున్నారు. బిపాసా చాలా బేబీ బంప్ ఫోటోషూట్లు, ఆమె ప్రెగ్నెన్సీకి సంబంధించిన కొన్ని వీడియోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వచ్చింది. కొన్ని నెలల క్రితం, బిపాసా బసు బాంబే టైమ్స్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తనకు ఒక కుమార్తె కావాలని చెప్పగా ఇప్పుడు ఆమె కోరిక నిజమైంది.
బిపాసా బసు, కరణ్ సింగ్ గ్రోవర్ ల ప్రేమకథ ‘ఎలోన్’ సెట్స్లో మొదలై పెళ్లితో మరింత బలపడింది. తొలి సినిమా సెట్స్లోనే బిపాసాతో కరణ్కి సాన్నిహిత్యం పెరిగింది. కరణ్ ‘ఎలోన్’ షూటింగ్ సమయంలో జెన్నిఫర్ వింగెట్ను వివాహం చేసుకున్న సమయంలో బిపాసాతో ఎఫైర్ వార్తల నేపథ్యంలో కరణ్ – జెన్నిఫర్ మధ్య విభేదాలు వచ్చాయి. ఆ తర్వాత వారిద్దరూ విడిపోవాలని నిర్ణయించుకోవడంతో కరణ్ 2016 లో బిపాసాను వివాహం చేసుకున్నారు.