ట్రంప్‌ పూర్తిగా కోలుకోకపోతే డిబేట్‌లో పాల్గొనన్ను

ట్రంప్‌ ఆరోగ్య పరిస్థితి చూస్తే మరో డిబేట్‌ నిర్వహించకపోవడమే మంచిది.. జో బైడెన్

Biden

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రక్రియలో భాగంగా నా ప్రత్యర్థి బైడెన్ తో 15న జరుగనున్న మియామీ డిబేట్ లో పాల్గొనేందుకు సిద్ధంగా ఉన్నాను అని ట్రంప్‌ చెప్పిన విషయం తెలిసిందే. అయితే, ఆయనకు కరోనా సోకిన నేపథ్యంలో బైడెన్ ఈ విషయంపై స్పందించారు. ట్రంప్‌ కరోనా‌ నుంచి పూర్తిగా కోలుకోకపోతే ఆయనతో డిబేట్‌లో పాల్గొననని చెప్పారు. కరోనా నిబంధనలకు అనుగుణంగా రెండో డిబేట్‌ను నిర్వహించాలనుకున్నామని ఆయన స్పష్టం చేశారు. ట్రంప్‌ ఆరోగ్య పరిస్థితి చూస్తే ఇప్పుడు డిబేట్‌ నిర్వహించకపోవడమే మంచిదనిపిస్తోందని ఆయన తెలిపారు. కాగా, ఆసుపత్రిలో కేవలం మూడు రోజులపాటు చికిత్స తీసుకున్న ట్రంప్ అనంతరం వైట్‌హౌస్‌కు వచ్చిన విషయం తెలిసిందే. ఆయన ఆరోగ్యం పూర్తిస్థాయిలో బాగుందని వైద్యులు నిర్ధారించారు. అయినప్పటికీ ట్రంప్‌ సలహాదారులు, అధికారుల్లో చాలా మందికి కూడా కరోనా నిర్ధారణ అయింది. ఈ డిబేట్‌లో వాళ్లు కూడా పాల్గొనాల్సి ఉంటుంది. దీంతో దీనిపై సందిగ్ధత నెలకొంది.


తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/