ఎన్నికల్లో బిజెపి గెలిస్తే భూపేంద్ర తన పదవిలో కొనసాగుతారుః అమిత్ షా
పరోక్షంగా గుజరాత్ ఎన్నికల్లో బిజెపి సీఎం అభ్యర్థిని ప్రకటించిన కేంద్ర హోం మంత్రి

న్యూఢిల్లీః త్వరలో జరగనున్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి తన సీఎం అభ్యర్థి ఎవరన్న విషయంపై క్లారిటీ ఇచ్చేసింది. ఈ మేరకు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా నుంచి మంగళవారం ఈ క్లారిటీ వచ్చింది. ప్రస్తుతం గుజరాత్ సీఎంగా కొనసాగుతున్న భూపేంద్ర పటేలే తమ సీఎం అభ్యర్థి అన్న అర్థం వచ్చేలా అమిత్ షా మంగళవారం ఓ కీలక వ్యాఖ్య చేశారు. ప్రస్తుతం జరుగుతున్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి విజయం సాధిస్తే… భూపేంద్ర పటేల్ తన పదవిలో కొనసాగుతారు అంటూ అమిత్ షా ప్రకటించారు.
ప్రధాని నరేంద్ర మోడీతో పాటు తనకూ సొంత రాష్ట్రమైన గుజరాత్ లో అసెంబ్లీ ఎన్నికలను అమిత్ షా ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. ఈ క్రమంలో మంగళవారం అహ్మదాబాద్ వచ్చిన ఆయన పలు జాతీయ మీడియా సంస్థలతో మాట్లాడారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధుల నుంచి ఎదురైన ఓ ప్రశ్నకు బదులిచ్చే క్రమంలో… గుజరాత్ లో బిజెపి అధికారంలోకి వస్తే… భూపేంద్ర పటేల్ తన పదవిలో కొనసాగుతారంటూ అమిత్ షా చెప్పుకొచ్చారు. గత ఎన్నికల్లో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన భూపేంద్రకు అనూహ్యంగా సీఎం పదవి దక్కింది. విజయ్ రూపానీ నుంచి ఆయన సీఎం కుర్చీని దక్కించుకున్నారు.
తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండిః https://www.vaartha.com/news/international-news/