‘మేడే’ స్పెషల్ : భోళాశంకర్ సరికొత్త పోస్టర్ రిలీజ్

నేడు మే డే సందర్బంగా భోళా శంకర్ నుండి సరికొత్త పోస్టర్ రిలీజ్ అయ్యింది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా మెహర్ రమేష్ దర్శకత్వంలో తమన్నా హీరోయిన్ గా అనిల్ సుంకర నిర్మిస్తున్న భారీ చిత్రం ‘భోళా శంకర్’. చిరంజీవి గత చిత్రం వాల్తేరు వీరయ్య మొన్న సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో భోళా శంకర్ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.

నేడు మే డే సందర్భంగా న్యూ పోస్టర్ రిలీజ్ అయ్యింది. చిరంజీవి ట్యాక్సీ డ్రైవర్ గా ఈ సినిమాలో కనిపించబోతున్నట్లుగా ఈ పోస్టర్స్ తో చిత్ర యూనిట్ సభ్యులు క్లారిటీ ఇచ్చారు. చిరంజీవి లుక్ ను చూస్తూ ఉంటే వింటేజ్ చిరంజీవిని చూసినట్లుగా ఉందని మెగా అభిమానులతో పాటు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించిన ముఖ్య సన్నివేశాలను చిరంజీవి కీర్తి సురేష్ తమన్నా వెన్నెల కిషోర్ మరియు ఇతరులతో తదుపరి షెడ్యూల్ కోల్కత్తాలో ప్రారంభమవుతుంది. ఆగస్టు లో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.