రానున్నది కాంగ్రెస్ ప్రభుత్వమే : భట్టి విక్రమార్క

హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత మల్లు భట్టి విక్రమార్క ప్రజా సమస్యల పరిష్కారం కొరకై మధిర నియోజకవర్గంలో చేపట్టిన పీపుల్స్ మార్చ్ (పాదయాత్ర) ను శనివారం ఉదయం చింతకాని మండలం జగన్నాధపురంలో ప్రారంభించారు. ప్రజలు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొని దారి పొడవునా బంతిపూల వర్షం కురిపిస్తూ తన అభిమానాన్ని చాటుకున్నారు. మహిళలు మంగళ హారతులు పట్టి వీరతిలకం దిద్దారు. రానున్నది కాంగ్రెస్ ప్రభుత్వమే అంటూ భట్టి తన పాదయాత్రలో ప్రజలకు భరోసా కలిగిస్తున్నారు. పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలు పెంచి పేదలు, మధ్య తరగతి వర్గాల ప్రజలపై భారం వేస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు గుణపాఠం తప్పదని హెచ్చరించారు. కేంద్రంలో మోడీ, రాష్ట్రంలో కేసీఆర్ ప్రజలను మోసం చేస్తూ మభ్యపెడుతున్నారని మండిపడ్డారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/international-news/