తెలంగాణ లో నాల్గో రోజు కొనసాగుతున్న రాహుల్ యాత్ర

రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర తెలంగాణ లో నాల్గో రోజు కొనసాగుతుంది. శనివారం ఉదయం 6 గంటలకు మహబూబ్ నగర్ జేపీఎంసీ నుంచి రాహుల్ తన పాదయాత్ర మొదలుపెట్టారు. రాహుల్ గాంధీ పాదయాత్రలో హీరోయిన్ పూనమ్ కౌర్ జాయిన్ అయ్యారు. మహబూబ్ నగర్ టౌన్ నుంచి జడ్చర్లలోని రాజాపూర్ వరకు పాదయాత్ర కొనసాగనుంది.

ఈరోజు మొత్తం 20.3 కిలోమీటర్ల మేర రాహుల్‌ పాదయాత్ర చేయనున్నారు. రాహుల్‌ వెంట CLP లీడర్‌ భట్టి విక్రమార్క, పలువురు నేతలు నడుస్తున్నారు. సాయంత్రం TPCC చీఫ్‌ రేవంత్‌రెడ్డి పాదయాత్రలో జాయిన్‌ కానున్నారు. రాత్రి 7 గంటలకు జడ్చర్లలో పాదయాత్రను ముగియనుంది. గొల్లపల్లిలోని శ్రీ సద్గురు మహర్షి మలయాల స్వామి లలితాంబిక తపోవనంలో బస చేయనున్నారు. ఈ యాత్రలో కేంద్ర రాష్ట్ర ప్రభూత్వాల వైఫల్యాలపై రాహుల్ గళమెత్తుతున్నారు. ప్రజా సమస్యలను తెలుసుకుని.. పార్టీ వైఖరిని స్పష్టం చేస్తున్నారు.