భారత్‌ బయోటెక్‌ అత్యవసర వినియోగానికి దరఖాస్తు

Bharat Biotech’s COVID-19

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి నివారణకు అభివృద్ధి చేసిన భారత్‌ బయోటెక్‌ సంస్థ టీకా అత్యవసర వినియోగానికి అనుమతి కోరుతూ కేంద్ర డ్రగ్‌ రెగ్యులేటర్‌కు దరఖాస్తు చేసింది. ఇప్పటికే సీరం ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా, అమెరికా ఫార్మా దిగ్గజం ఫైజర్‌ దరఖాస్తు చేసిన విషయం తెలిసిందే. కొవాగ్జిన్‌ టీకాను ఇండియన్‌ కౌన్సిల్‌ ఫర్‌ మెడికల్‌ రీసెర్చ్‌ (ఐసీఎంఆర్‌), నేషనల్‌ వైరాలజీ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా సహకారంతో అభివృద్ధి చేస్తోంది. ఇప్పటికే టీకా మూడో విడత ట్రయల్స్‌లో జరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా 18 ప్రాంతాల్లో 22వేల మంది వలంటీర్లపై వ్యాక్సిన్‌ ప్రయోగిస్తున్నారు.

తొలి, రెండో దశల్లో టీకా మెరుగైన ఫలితాలు రావడంతో డ్రగ్‌ కంట్రోల్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా మూడో విడత ట్రయల్స్‌కు అనుమతి ఇచ్చింది. ట్రయల్స్‌ విజయవంతమైతే తర్వాత వ్యాక్సిన్‌కు ఆమోద ముద్ర వేయనున్నారు. ప్రపంచవ్యాప్తంగా 1.5 మిలియన్లకుపైగా జనం మహమ్మారికి బలయ్యారు. ప్రస్తుతం జనమంతా వ్యాక్సిన్‌ కోసం ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో పలు టీకాల అత్యవసర పరిస్థితుల్లో వినియోగానికి పలు దేశాలు అనుమతి ఇచ్చాయి. ఇటీవల ప్రధాని నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలోనూ ప్రధాని మోడి కొన్ని వారాల్లో కొవిడ్‌ వ్యాక్సిన్‌ సిద్ధంగా ఉండవచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా యూకే, బహ్రెయిన్‌ ఫైజర్‌ టీకా అత్యవసర వినియోగానికి దరఖాస్తు చేయగా.. ఆ దేశాలు ఆమోదించాయి.

కాగా, దేశంలో కొద్దివారాల్లోనే కొవిడ్‌ టీకా సిద్ధమవుతుందని ఈ నెల 4న జరిగిన అఖిలపక్ష సమావేశంలో ప్రధాని మోడి ఆశాభావం వ్యక్తిం చేసిన సంగతి తెలిసిందే.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/