దుర్గా పూజలో అపశ్రుతి..ముగ్గురు మృతి

దుర్గమ్మ పూజలో అపశృతి చోటుచేసుకొని , ముగ్గురు మరణించిన ఘటన ఉత్తరప్రదేశ్‌లోని భదోహిలో చోటుచేసుకుంది. భదోహిలోని దుర్గామాత మండపంలో పూజలు చేస్తుండగా..అమ్మవారికి హారతి ఇస్తుండగా ప్రమాదవశాత్తు మండపంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో మండపం పూర్తిగా కాలిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.

ఈ ప్రమాదంలో చిన్నారి సహా ముగ్గురు మృతిచెందగా, మరో 60 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను హుటాహుటిన దగ్గరలోని హాస్పటల్ కు తరలించారు. ప్రమాద సమయంలో మండపంలో 150 మంది ఉంన్నారని జిల్లా మేజిస్ట్రేట్‌ గౌరంగ్‌ రాఠీ తెలిపారు. షార్ట్‌సర్క్యూట్‌ కారణంగా ప్రమాదం జరిగిందని భావిస్తున్నామని చెప్పారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు, ఓ మహిళ ఉన్నారని తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు.