సీఎం కేసీఆర్ నిర్ణయంతో అగ్రవర్ణాల్లోని నిరుపేద విద్యార్థులకు లబ్ధి
పెద్దపల్లిలో కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
Peddapalli: అగ్రవర్ణాల్లోని నిరుపేదలకు లబ్ధి చేకూర్చేందుకు 10 శాతం రిజర్వేషన్లు తీసుకురావడంతో ఎంతో మేలు జరుగుతుందని పెద్దపెల్లి మున్సిపల్ చైర్ పర్సన్ డాక్టర్ దాసరి మమతా-ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు.
పెద్దపల్లిలోని జెండా కూడలిలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. సీఎం కేసీఆర్ నిర్ణయం వల్ల అగ్రవర్ణాల్లోని నిరుపేద విద్యార్థులకు లబ్ధి చేకూరుతుందని, ఉద్యోగ అవకాశాలు పెంపొందుతాయని అన్నారు
తాజా ‘మొగ్గ ‘(చిన్నారుల ప్రత్యేకం) కోసం : https://www.vaartha.com/specials/kids/