బాధ్యతలు చేపట్టిన వేణుగోపాల కృష్ణా

Venugopala Krishna

అమరావతి: ఏపిలో కొత్తగా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన ఇద్దరిలో ఒకరు ఈరోజు బాధ్యలు చేపట్టారు. ఏపిలోని రామచంద్రపురం ఎమ్మెల్యే వేణుగోపాల కృష్ణా బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. మంత్రివర్గంలో కొత్తగా చోటు సంపాదించుకున్న సీదిరి అప్పాలరాజు పశుసంవర్ధక, మత్స్యశాఖ మంత్రిగా రెండు రోజుల క్రితం బాధ్యతలు చేపట్టారు. ఇదివరకు మంత్రులుగా పనిచేసిన పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌, మోపిదేవి వెంకట రమణ తమ పదవులకు రాజీనామా చేయడంతో ఏర్పడ్డ ఖాళీలను వారం రోజుల క్రితం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ భర్తీ చేసిన విషయం తెలిసిందే. మంత్రివర్గంలో శాఖల మార్పుల అనంతరం ఇదివరకు బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేసిన శంకరనారాయణకు రోడ్లు, భవనాల శాఖను కేటాయించారు.డిప్యూటీ సీఎంగా కొనసాగుతున్న ధర్నాన కృష్ణదాస్‌కు రెవెన్యూ బాధ్యతలు అప్పగించారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/