పెళ్లి కాని జంటలకు ప్రవేశం లేదట : ఇందిరాపార్క్ వద్ద బ్యానర్..

ప్రజలనుంచి తీవ్ర ఆగ్రహావేశాలు: బ్యానర్ ను వెంటనే తొలగించిన జీహెచ్ఎంసీ

Banner at Indira Park
Banner at Indira Park

Hyderabad: ట్యాంక్ బండ్ సమీపంలోఇందిరా పార్క్ నిత్యం సందర్శకులతో నిండిపోతూ ఉంటుందనే విషయం తెలిసిందే. పార్క్ వద్ద ఓ బ్యానర్ అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. పెళ్లి కాని జంటలకు పార్కులో ప్రవేశం లేదు అని … పార్క్ మేనేజ్ మెంట్ పేరుతొ స్పష్టం చేశారు. ఇపుడు ఈ బ్యానర్‌ కలకలం రేపింది. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ బ్యానరే దర్శనమిస్తోంది. దీనిపై స్పందించిన మీరా సంఘమిత్ర అనే సామాజికవేత్త జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మీని ట్యాగ్ చేస్తూ విషయాన్ని ఆమె దృష్టికి తీసుకెళ్లారు. ‘పార్కులో ప్రవేశానికి పెళ్లిని అర్హత ప్రమాణంగా నిర్దేశించడం ఏంటి? పబ్లిక్ పార్క్ అంటే అందరికీ ప్రవేశం ఉంటుంది. బ్యానర్‌లో పేర్కొన్న అంశం పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమైన చర్య’ అని స్పష్టం చేశారు. ఈ బ్యానర్ పై తీవ్ర స్థాయిలో ఆగ్రహావేశాలు వ్యక్తం కావడంతో జీహెచ్ఎంసీ అధికారులు వెంటనే స్పందించి ఇందిరా పార్క్ వద్ద ఆ బ్యానర్‌ను తొలగించారు.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం:https://www.vaartha.com/andhra-pradesh/