మాల్యా దివాళా కేసులో లండన్‌ కోర్టు కు బ్యాంకులు

బ్యాంకులే వాదనలు

Vijay Mallya
Vijay Mallya

Britain విజయ్‌ మాల్యాపై లండన్‌ కోర్ట్‌ దివాళా విచారణలో ఎస్‌బీఐ నేతృత్వంలోని బ్యాంకుల కన్షార్టియం మరోసారి వాదనలు వినిపించింది. కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌ తమ నుంచి తీసుకున్న రుణాలను తిరిగి రాబట్టేందుకు ప్రయ త్నిస్తున్నామని తెలిపాయి.

ఐసీసీ(చీఫ్‌ ఇన్సాల్వెన్సీ అండ్‌ కం పెనీస్‌) జడ్జి మైకేల్‌ బ్రిగ్స్‌ వర్చువల్‌గా విచారణ జరి పారు. కాగా తమ వాదనలకు భారతీయ చట్టాల ద్వారా బలం చేకూర్చుకునేందుకు ఇరు పక్షాలు నియమించుకున్న రిటైర్డ్‌ భారత సుప్రీంకోర్ట్‌ జడ్జీలను తొలగించుకుని బ్యాంకులే వాదనలు వినిపిం చాయి.

రుణ భారాలను తగ్గించుకునేందుకు ఆస్తుల పై భద్రతను ఉపసంహరించుకునే హక్కులు తమ కు ఉన్నాయని బ్యాంకులు వాదించాయి

ప్రజల సంపదతో ముడిపడివున్న ఈ ఆస్తుల వద్ద భద్రతను ఉపసం హరించుకోవడాన్ని మాల్యా తరపు న్యాయవాది ప్రశ్నిం చారు. ఒక కమర్షియల్‌ బ్యాంక్‌కు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో తెలుసునని కన్షార్టియం పేర్కొంది.

తాజా ఎన్నారై వార్తల కోసం : https://www.vaartha.com/news/nri/