వరుసగా 4రోజుల పాటు బ్యాంకులకు సెలవు

న్యూఢిల్లీ: బ్యాంకుల ప్రైవేటీకరణకు నిరసనగా మార్చి 15వతేదీ నుంచి రెండు రోజుల పాటు సమ్మెకు బ్యాంకు ఉద్యోగ సంఘాలు పిలుపునిచ్చాయి. బ్యాంకు ఉద్యోగుల సమ్మె నేపథ్యంలో మార్చి 13 నుంచి వరుసగా 4రోజుల పాటు బ్యాంకులు మూసివేయనున్నారు. మార్చి 13వతేదీన రెండవ శనివారం కాగా, మార్చి 14వతేదీ ఆదివారం సెలవు. మార్చి 15,16 తేదీల్లో బ్యాంకు ఉద్యోగుల సమ్మెతో బ్యాంకులు మూసివేయనున్నారు. మొబైల్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ కార్యకలాపాలు నిరంతరాయంగా కొనసాగుతున్నప్పటికీ వరుసగా 4రోజుల పాటు బ్యాంకుల బ్రాంచీలు పనిచేయవు. వరుస సెలవులతో బ్యాంకులను మూసివేస్తున్నందున ఖాతాదారులు తమ ఆర్థిక లావాదేవీల కోసం ముందస్తు ప్రణాళిక రూపొందించుకోవాలని బ్యాంకులు సూచించాయి.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/