లాభాల జోరులో ముగిసిన మార్కెట్లు
ముంబయి: దేశీయ మార్కెట్లు వరుసగా మూడో రోజు కూడా లాభాలతోనే ముగిశాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ సెన్సెక్స్ 163 పాయింట్లు లాభంపొంది 41,306 వద్ద ముగిసింది. నిఫ్టీ సూచీ 48 పాయింట్లు ఎగబాకి 12,137 వద్ద ట్రేడయింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.71.27 గా ఉంది.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/