6వికెట్ల తేడాతో కివీస్ పై బంగ్లాదేశ్ గెలుపు

Bangladesh win over Kiwis

ఐసీసీ అండర్ -19 వరల్డ్ కప్ లో ఇవాళ బంగ్లాదేశ్ వర్సెస్ న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన సెకండ్ సెమీ ఫైనల్ ఈ మ్యాచ్ లో న్యూజిలాండ్ జట్టుపై బంగ్లాదేశ్ గెలిచింది. ముందుగా బంగ్లాదేశ్ జట్టు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోవడంతో న్యూజిలాండ్ జట్టు తొలి బ్యాటింగ్ చేపట్టింది. నిర్ణీత 50 ఓవర్లలో 8వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసింది. 212 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ దిగిన బంగ్లాదేశ్ జట్టు 44.1 ఓవర్లలో 215 పరుగులు చేసి విజయాన్ని సాధించింది. బంగ్లాదేశ్ జట్టులో మహ్మదుల్ హసన్ జాయ్ సెంచరీ చేసి జట్టును గెలిపించాడు.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/movies/