బండ్ల గణేష్ కీలక నిర్ణయం..షాక్ లో అభిమానులు

bandla ganesh
bandla ganesh

బ్లాక్ బస్టర్ బండ్ల గణేష్ కీలక నిర్ణయాన్ని ప్రకటించి అభిమానులకు షాక్ ఇచ్చారు. తాను రాజకీయాలకు గుడ్ బై చెప్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్ నేతగా ఉన్న బండ్ల గణేష్ రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాని ట్విట్టర్ వేదికగా ప్రకటించి , ఇక నుండి రాజకీయాలకు దూరంగా వుంటానని తెలిపి షాక్ ఇచ్చారు.

కమెడియన్ గా ఇండస్ట్రీ లో అడుగుపెట్టి అతి తక్కువ టైంలోనే అగ్ర నిర్మాతగా ఎదిగాడు. పవన్ కళ్యాణ్ , రామ్ చరణ్, అల్లు అర్జున్ , రవితేజ , ఎన్టీఆర్ వంటి అగ్ర హీరోలతో సినిమాలు నిర్మించి బ్లాక్ బస్టర్ ప్రొడ్యూసర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. 2018లో కాంగ్రెస్‌ పార్టీలో చేరిన బండ్ల గణేష్.. ఇప్పుడు సడెన్ గా రాజకీయాలకు గుడ్ బై చెపుతున్నట్లు ట్విట్టర్ వేదికగా తెలిపారు.

“నా కుటుంబ బాధ్యతల వల్ల.. నా ఉమ్మడి కుటుంబ సభ్యుల నేపథ్యంలో.. వారి కోరికపై మా పిల్లల భవిష్యత్ గురించి ఆలోచిస్తూ.. నాకున్న పనులు, వ్యాపారాల వల్ల నేను రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాను. నాకు ఏ రాజకీయ పార్టీతో శత్రుత్వం గానీ.. మిత్రుత్వం గానీ లేదు. అందరూ నాకు ఆత్మీయలే.. అందరూ నాకు సమానులే. ఇంతకుముందు నావల్ల ఎవరైనా ప్రత్యక్షంగా.. పరోక్షంగా.. బాధపడి ఉంటే నన్ను పెద్ద మనసుతో క్షమిస్తారని ఆశిస్తూ”న్ననంటూ బండ్ల గణేష్ ట్వీట్ చేశారు.