విద్యుత్ ఛార్జీల పెంపుపై కేసీఆర్ కి బండి సంజయ్ బహిరంగ లేఖ
హైదరాబాద్ : బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సీఎం కెసిఆర్ కు బహిరంగ లేఖని రాశారు. పెంచిన విద్యుత్ ఛార్జీలను తక్షణం ఉపసంహరించుకోవాలని, ప్రభుత్వం రూ. 6 వేల కోట్ల భారాన్ని తెలంగాణ ప్రజలపై మోపుతోందన్నారు. గత ఎనిమిదేళ్లుగా అసమర్థ విధానాలను అనుసరిస్తున్న మీ ప్రభుత్వం తెలంగాణ ప్రజలపై ఆరు వేల కోట్ల విద్యుత్ చార్జీల భారాన్ని మోపిందని లేఖలో తెలిపారు.
ఈ ప్రజా వ్యతిరేక చర్యను వెంటనే ఉపసంహరించుకొని ప్రజలకు ఉపశమనం కల్పించాలని లేదా పెంచిన విద్యుత్ ఛార్జీల విషయంలో టిఆర్ఎస్ ప్రభుత్వం రిఫరెండమ్ కు సిద్ధం కావాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. రెఫరెండంకు ప్రభుత్వం సిద్ధపడి ముందుకు రాకపోతే బిజెపి తెలంగాణ శాఖ విద్యుత్ ఛార్జీల పెంపుపై రిఫరెండం నిర్వహిస్తుంది. దానికి మీరు సిద్ధమా అంటూ లేఖలో సవాల్ చేశారు.
తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/