‘మా’ ఫలితాలపై బండి సంజయ్ సంచలన ట్వీట్స్..

‘మా’ ఫలితాల ఫై తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన ట్వీట్స్ చేసారు. దేశాన్ని విచ్ఛిన్నం చేయాలనుకున్న తుకుడే గ్యాంగ్ కు మద్దతిచ్చిన వారికి సరైన గుణపాఠం చెప్పారు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. “మా” అధ్యక్షుడిగా గెలిచిన మంచు విష్ణు గారితో సహా ఇరు ప్యానెల్ లోని విజేతలందరికీ శుభాకాంక్షలు తెలిపిన సంజయ్.. ఈ ఎన్నికల్లో జాతీయవాద వ్యతిరేక శక్తుల్ని చిత్తుగా ఓడించిన “మా” ఓటర్లకు ధన్యవాదాలు.. అంటూ ప్రకాష్‌రాజ్‌పై సెటైర్లు వేశారు.

ఇక, దేశాన్ని విచ్ఛిన్నం చేయాలనుకున్న తుకుడే గ్యాంగ్ కు మద్దతిచ్చిన వారికి సరైన గుణపాఠం జరిగింది అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు బండి సంజయ్‌. “మా” ఓటర్లు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అని రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎదురు చూశారు.. మా ఓటర్లు స్ఫూర్తిదాయకమైన తీర్పు ఇచ్చారు.. అందరికి అభినందనలు.. భారత్ మాతాకి జై ! అంటూ ట్వీట్‌ చేశారు.

ప్రకాష్ రాజ్ ముందు నుండి కూడా బిజెపి కి వ్యతిరేకం అనే సంగతి తెలిసిందే. ఎన్నో సార్లు మోడీ నిర్ణయాల ఫై వ్యతిరేకించారు. అందుకే ఇప్పుడు సంజయ్ ఇలా ట్వీట్స్ చేయడం జరిగిందని అంత మాట్లాడుకుంటున్నారు.