కెసిఆర్ కు సంబంధించిన సంచలన విషయం బయపటపెడతా
స్పీకర్ అనుమతి కోసం ప్రయత్నిస్తున్నానని వెల్లడి
హైదరాబాద్: సిఎం కెసిఆర్కు సంబంధించిన సంచలన విషయాన్ని వెల్లడిస్తానని తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ కీలక ప్రకటన చేశారు. నాడు ఎంపీగా ఉన్న సమయంలో కెసిఆర్ పార్లమెంటును తప్పుదోవ పట్టించారని ఆరోపించారు. అందుకు సంబంధించిన ఆధారాలు ఉన్నాయని, స్పీకర్ అనుమతి కోసం ప్రయత్నిస్తున్నానని తెలిపారు. బిజెపి అధిష్ఠానం అనుమతితో కెసిఆర్ బండారం బయటపెడతానని అన్నారు. తాను చెప్పబోయేది ముమ్మాటికీ పార్లమెంటును కుదిపేసే అంశం అవుతుందని బండి సంజయ్ స్పష్టం చేశారు.
కాగా, సంజయ్ సమక్షంలో కపిలవాయి దిలీప్కుమార్ శుక్రవారం బిజెపిలో చేరారు. టీఆర్ఎస్ వ్యతిరేక శక్తులన్నీ ఏకతాటిపైకి రావాలని సంజయ్ పిలుపునిచ్చారు. కెసిఆర్ రాజకీయ స్వార్థం కోసమే పీవీని వాడుకుంటున్నారని, పీవీ ఘాట్ను ఎంఐఎం కూల్చుతామంటే కెసిఆర్ కనీసం స్పందించలేదన్నారు. మోసం చేయటంలో కెసిఆర్ ఏక్ నంబర్..కెటీఆర్ దస్ నంబర్ అని ఎద్దేవా చేశారు. వామనరావు హత్యపై సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్కు ఓటేసి పొరపాటు చేయొద్దని కోరారు.
తాజా ఏపి వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/