ఈ నెల 17 నుంచి మునుగోడులో బండి సంజయ్ ప్రచారం

TBJP Chief Bandi Sanjay

హైదరాబాద్‌ః బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మునుగోడులో ఈ నెల 17నుంచి ప్రచారం చేస్తారని బిజెపి స్టీరింగ్ కమిటీ చైర్మన్ వివేక్ వెంకటస్వామి తెలిపారు. అవినీతికి పాల్పడిన కెసిఆర్కు ప్రజలే తగిన బుద్ధి చెప్తారని విమర్శించారు. కెసిఆర్ సింగరేణి తాడిచెర్లలో 3200కోట్ల అవినీతికి పాల్పడ్డారని..ఆయన అవినీతి వ్యవహారాలన్నీ త్వరలోనే బయటకొస్తాయని తెలిపారు. అప్పటి శ్రీలంక ప్రధాని రాజపక్స అవినీతితో విమానాలు కొంటె ప్రజలు బుద్దిచెప్పారని..తెలంగాణ రాజపక్స అయిన కెసిఆర్ ను కూడా ప్రజలు గద్దె దించుతారని అన్నారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/andhra-pradesh/