మంత్రి మల్లారెడ్డి అక్రమాలకు పాల్పడుతున్నాడంటూ బండి సంజయ్ ఆగ్రహం

బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్..బిఆర్ఎస్ మంత్రి మల్లారెడ్డి ఫై పలు ఆరోపణలు చేసారు. మంత్రి మల్లారెడ్డి జోకర్ పేరుతో పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడుతున్నాడని.. తనను విమర్శించే అర్హత డ్రైనేజీ మంత్రికి లేదని కీలక వ్యాఖ్యలు చేసారు సంజయ్. శనివారం ‘ప్రజా గోస- బీజేపీ భరోసా’ కార్యక్రమంలో భాగంగా బోడుప్పల్ లోని మారుతినగర్ లో ఏర్పాటు చేసిన ‘వక్ఫ్ బాధితుల గోస బీజేపీ భరోసా కార్యక్రమంలో బండి సంజయ్ పాల్గొన్నారు.

ఈ సందర్భాంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నంత కాలం బోడుప్పల్ లో వక్ఫ్ బాధితుల సమస్య పరిష్కారం కాదని , బీజేపీని గెలిపిస్తే సమస్యను పరిష్కరిస్తామని బండి సంజయ్ హామీ ఇచ్చారు. జవహర్ నగర్ డంపింగ్ యార్డ్, 59 జీవో బాధితుల సమస్యలను కూడా పరిష్కరిస్తామని ఆయన అన్నారు.

ఇక మంత్రి మల్లారెడ్డి జోకర్ పేరుతో పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడుతున్నాడని , తనను విమర్శించే అర్హత డ్రైనేజీ మంత్రికి లేదన్నారు. హిందూ సమాజం సంఘటితం కోసం తాను బరాబర్ మాట్లాడతా అని తేల్చి చెప్పారు.