ఎస్టీలకు కేసీఆర్ 10 శాతం రిజర్వేషన్లు ప్రకటనఫై బండి సంజయ్ కామెంట్స్

bandi-sanjay-comments-on-cm-kcr

దళితబంధు తరహాలోనే రాష్ట్రంలోని గిరిజనులకు గిరిజన బంధు ను అందజేస్తారమని , 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ.. వారం రోజుల్లో జీవో విడుదల చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ప్రకటన పట్ల బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ స్పందించారు. ఉప్పల్ పాదయాత్రలో ఆయన మాట్లాడుతూ, ఎస్టీలకు 10 శాతం రిజర్వేషన్లు ఇవ్వకపోతే కేసీఆర్ పురుగులు పడి పోతాడని శాపనార్థాలు పెట్టారు.

బీజేపీపై నెపం నెట్టి, సుప్రీంకు వెళ్లి స్టే తీసుకురావాలన్నదే టీఆర్ఎస్ పన్నాగం అని బండి సంజయ్ అన్నారు. సచివాలయానికి అంబేద్కర్ పేరుపెట్టిన కేసీఆర్… కొత్త సచివాలయంలో ఒక కుర్చీ వేసి దళితుడ్ని సీఎంగా చేయాలని డిమాండ్ చేశారు. ప్రజా సమస్యలు పట్టించుకోని ఏకైక సీఎం కేసీఆరేనని అన్నారు. తడిగుడ్డతో గొంతు కోసే మూర్ఖుడు అని సంజయ్ విమర్శించారు. లిక్కర్ కుంభకోణం సహా అన్ని స్కాంలలో కేసీఆర్ కుటుంబం ఉందని బండి సంజయ్ ఆరోపించారు. సీబీఐ అంటే చాలు వారికి కాలు విరుగుతుంది, ఈడీ అంటే కరోనా వస్తుంది అని సెటైర్లు వేశారు.