హైకోర్టులో బండి సంజ‌య్ లంచ్ మోష‌న్ పిటిష‌న్

హైదరాబాద్: తెలంగాణ బీజేపీ చీఫ్‌ బండి సంజయ్‌ ఈనెల 2న కరీంనగర్‌లోని బీజేపీ కార్యాలయంలో తెలంగాణ ఉపాధ్యాయ ఉద్యోగుల సమస్యల పరిష్కారనికై జాగరణ దీక్ష చేపట్టారు. అయితే ఈ దీక్షకు అనుమతులు లేవని, కోవిడ్‌ నిబంధనలు ఉలంఘించారంటూ పోలీసులు నాటకీయ పరిణామాల మధ్య బండి సంజయ్‌ను అరెస్ట్‌ చేసి మరుసటి రోజు కరీంనగర్‌ ఎక్సైజ్‌ కోర్టులో హజరుపర‌చ‌గా.. కోర్టు బండి సంజయ్‌కి 14 రోజుల రిమాండ్‌ విధించింది. ఆ సమయంలో బండి సంజయ్‌ తరుపు లాయర్‌ కోర్టులో బెయిల్‌ పిటిషన్‌ వేయడంతో దాన్ని కోర్టు తిరస్కరించింది. ఈ నేపథ్యంలో ఇవాళ‌ హైకోర్టులో బండి సంజయ్‌ తరుపు లాయర్‌ బండి సంజయ్‌ రిమాండ్‌ను రద్దుచేయాలంటూ లంచ్‌మోషన్‌ పిటిషన్‌ను దాఖలు చేశారు. అయితే ఈ పిటిష‌న్ కాసేపట్లో విచారణకు రానుంది.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/