విద్యా రంగంలో 18వ స్థానంలో తెలంగాణ ఉండటమే నిదర్శనం

టీచర్ పోస్టులు భర్తీ ఎప్పుడో?..బండి సంజయ్

హైదరాబాద్: తెలంగాణలో ఖాళీగా ఉన్న 44 వేల టీచర్ పోస్టులను భర్తీ చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ డిమాండ్ చేశారు. టీచర్ పోస్టులను భర్తీ చేయకపోవడం వల్ల విద్యా వ్యవస్థ నిర్వీర్యమైందన్నారు. విద్యా రంగంలో 18వ స్థానంలో తెలంగాణ ఉండటమే నిదర్శనం అని పేర్కొన్నారు. బీఈడీ, డీఈడీ, పండిట్ శిక్షణ, పీఈటీ పూర్తి చేసిన టీచర్ పోస్టుల 7 లక్షల మంది నిరుద్యోగులు నిరాశలో ఉన్నారని తెలిపారు.

టీచర్లు లేక విద్యార్థులకు పాఠాలు చెప్పే నాథుడే కరువయ్యారని చెప్పారు. గత ఐదేళ్లుగా టెట్ పరీక్షలు నిర్వహించకపోవడంతో నిరాశలో యువత ఉందన్నారు. మైనారిటీ, ఎయిడెడ్ సంస్థల్లో వేలాది పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పారు. యుద్ద ప్రాతిపదికన ఖాళీ పోస్టులను భర్తీ చేసి విద్యారంగాన్ని రక్షించాని బండి సంజయ్ డిమాండ్ చేశారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/