హైకోర్టును ఆశ్రయించిన బండి సంజయ్ కుమారుడు

బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమారుడు బండి భగీరధ్ హైకోర్టు ను ఆశ్రయించారు. జనవరి 20న మహేంద్ర యూనివర్సిటీ నుంచి బండి భగీరథ్‌ సస్పెన్షన్‌కు గురికాగా.. తనను వివరణ అడగకుండానే యూనివర్సిటీ తనను సస్పెండ్ చేసిందని భగీరథ్‌ కోర్టుకు తెలిపాడు. ఇంటర్నల్ పరీక్షలు రాసేలా అనుమతి ఇవ్వాలని కోర్టు ను కోరారు భగీరధ్.

ఈ పిటిషన్ ను విచారించిన హైకోర్టు… భగీరధ్ సస్పెన్షన్ పై హైకోర్టు స్టే విధించింది. పరీక్షకు రాసేందుకు అనుమతి ఇవ్వాలని మహేంద్ర యూనివర్సిటీ కు కోర్టు ఆదేశించింది. మార్చ్ 9న హై కోర్టు ఉత్తర్వులు జారీ చేయగా…హై కోర్ట్ అదేశలతో పరీక్షలు రాశారు బండి భగీరద్. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు భగీరధ్ ను క్లాస్ లోకి అనుమతించాలని యూనివర్సిటీ కు హైకోర్టు ఆదేశించింది. జనవరి నెలలో మహీంద్రా వర్సిటీకి చెందిన విద్యార్థిపై బండి భగీరథ దాడి చేయడం తో యూనివర్సిటీ భగీరధ్ ను సస్పెండ్ చేసారు.