సీఎం జగన్ తో భేటీ కానున్న బాలినేని

జగన్ కార్యాలయానికి చేరుకున్న బాలినేని శ్రీనివాసరెడ్డి

అమరావతి : బాలినేని శ్రీనివాసరెడ్డి మంత్రి వర్గంలో స్థానం దక్కకపోవడంతో మనస్తాపానికి గురైనారు. దింతో బాలినేనికి బుజ్జగింపులు కొనసాగుతున్నాయి. బాలినేనితో సీఎం సలహదారు సజ్జల రామకృష్ణారెడ్డి జరిపిన చర్చలు ఫలించాయి. విజయవాడలోని తన నివాసం నుంచి జగన్ క్యాంపు కార్యాలయానికి తలశిల రఘురామ్, అప్పిరెడ్డిలతో కలిసి ఆయన వెళ్లారు. కాసేపటి క్రితమే వీరు జగన్ కార్యాలయానికి చేరుకున్నారు. బాలినేనితో జగన్ స్వయంగా మాట్లాడనున్నారు.

కాగా, సజ్జల, శ్రీకాంత్ రెడ్డి బాలినేనిని తన వద్దకు తీసుకురావాలని సజ్జలకు సీఎం ఆదేశించారు. బాలినేని శ్రీనివాసరెడ్డితో సీఎం జగన్ మాట్లాడనున్నారు. అంతకుముందు బాలినేని శ్రీనివాసరెడ్డిని సజ్జల మరోసారి కలిశారు. విజయవాడలోని బాలినేని నివాసానికి సజ్జలతో పాటు శ్రీకాంత్‌రెడ్డి, అప్పిరెడ్డిలు వెళ్లారు.

తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి:  https://www.vaartha.com/news/business/