షూలు చేతపట్టుకుని వరద ప్రాంతాల్లో ఎమ్మెల్యే బాలకృష్ణ

హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ..ప్రస్తుతం నియోజకవర్గం లో పర్యటిస్తున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు హిందూపురం నియోజకవర్గం అతలాకుతలమైంది. చాలా ఇల్లు నేలమట్టం అయ్యాయి. ఎంతమంది రోడ్డున పడ్డారు. ఈ తరుణంలో బాలకృష్ణ వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటించారు.

షూలు చేతపట్టుకుని వరదనీటిలో బాలకృష్ణ నడిచారు. వీధులు, ఇళ్లల్లోకి వెళ్లి బాధితులకు భరోసా కల్పించారు. ప్రభుత్వం నుంచి అవసరమైన సాయం అందలేదని ఈ సందర్భంగా బాలకృష్ణ మండిపడ్డారు. ప్రజలు ఇబ్బందులు పడుతున్నా.. వైసీపీ సర్కారు స్పందించడం లేదని ధ్వజమెత్తారు. వరద పరిస్థితులను అప్రమత్తం చేయడంలో విఫలమైందన్నారు. స్థానిక నాయకులు, అధికారులతో కలిసి ప్రజల సమస్యను తెలుసుకుని కలెక్టర్‌తో వరద పరిస్థితిపై సమీక్షించామని బాలకృష్ణ తెలిపారు. కొట్నూరు, శ్రీకంఠాపురం, పూలకుంట సమీపంలో వంతెనలు నిర్మించాలని ప్రభుత్వానికి నివేదించామన్నారు.

వైస్సార్సీపీ ప్రభుత్వం భూకబ్జాలు, నేరాలు తప్ప అభివృద్ధి చేయడం లేదన్నారు. కరోనా విపత్కర సమయంలోనూ ప్రజలకు నిత్యావసరాలు, మందులు పంపిణీ చేసింది తామేనని చెప్పారు.